ఎమ్మెల్సీ బరిలో టిటిడిపి ప్రెసిడెంట్ యల్ రమణ

-

హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ గాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో టిటిడిపి ప్రెసిడెంట్ యల్ రమణ కూడా దిగుతున్నారు. ఈ మేరకు ఆయన రేపు నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నిన్న  14 నామినేషన్ల దాఖలు అయ్యాయి. అలా ఇప్పటి వరకు మొత్తం 37 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 

నిన్న  నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ముప్పది రాజేశ్వరి, అన్వర్ ఖాన్, ఎం. గోపాల కృష్ణ, ముంబా అశోక్ కుమార్, మహమ్మద్ అలీ, మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్, మురళి గౌడ్, డి.వెంకటేశం, ప్రొఫెసర్. నాగేశ్వర్, కొలుకు ప్రతాప్, మాటేటి రవీంద్ర నాధ్,  కోశిక అణికాంత్, హర్ష వర్ధన్ రెడ్డి, కె. సాయన్నలున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news