క్రికెటర్ పృథ్వీ షాపై యువతి దాడిలో కొత్త ట్విస్ట్

-

సెల్ఫీ ఇవ్వలేదన్న కోపంతో టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షాను వెంబడించడమే కాకుండా దాడి చేసిన ఘటన కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ తరఫు న్యాయవాది పృథ్వీపై సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ షా మద్యం తాగి ఆమెపై బ్యాట్​తో దాడి చేశాడని ఆరోపించారు.

“ఫైవ్​ స్టార్​ హోటల్​లో సప్నా గిల్​.. సెల్ఫీ తీసుకునేందుకు పృథ్వీ షా దగ్గరకు వెళ్లింది. అప్పుడు వారంతా పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో షా కూడా మద్యం సేవించి ఉన్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న బ్యాట్​తో సప్నాపై దాడి చేశాడు. తర్వాత రోజు.. ఆమెపైనే కేసు పెట్టాడు. ఇప్పుడు అతడిపై మేము కేసు పెడతాం. మద్యం సేవించి అతడు కారు నడిపాడు. బైక్​ను కూడా ఢీకొన్నట్లు తెలిసింది. సప్నా, పృథ్వీ షా మధ్య ఎలాంటి పరిచయం లేదు” అని సప్నా గిల్​ లాయర్​ అలీ కాషిఫ్​ ఖాన్​ దేశ్​ముఖ్​ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news