T20 World Cup 2022: సంజు శాంసన్ పై పగపట్టిన సెలెక్టర్లు.. ఇక, కెరీర్ ముగిసినట్టేనా?

-

T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచ కప్ కు భారత జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఊహించినట్లుగానే టీమ్ ఇండియా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ కి అప్పగించారు. వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ లకు చోటు దక్కింది.

అయితే.. టీమ్ ఇండియా జట్టులో సంజు సామ్‌ సన్‌ లేకపోవడంపై… మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కండీషన్లలోనూ ఆడేటువంటి.. సంజును తీసేసి.. పంత్‌ ను తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంజు ను బీసీసీఐ బలి పశువు చేస్తుందని నిప్పులు చెరిగారు. సంజూ సామ్‌సన్‌ కెరీర్‌ ముగించేలా…. బీసీసీఐ పగ పట్టినట్లు కనిపిస్తుందని ట్వీట్లు పెడుతున్నారు.

Team india : రోహిత్ (C ), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news