జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణకు రెండు అవార్డులు..!

-

వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా( డబ్ల్యూసీఎస్​) నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణకు రెండు అవార్డులు వరించాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ద్వితీయ, తృతీయ అవార్డులు పొందారు.ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్​ చంద్రశేఖరరావు.. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటోకు రెండో స్థానం దక్కింది.

జన్నారం డివిజనల్ అధికారి సిరిపురపు మాధవరావు.. కవ్వాల్ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫోటోకు ( క్రెస్టెడ్ హాక్ ఈగల్ ) మూడో స్థానం దక్కింది.ఫోటోగ్రఫీ అవార్డులు సాధించిన ఇద్దరు అధికారులను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.నల్లమల్ల ప్రాంతంలోని ప్రతాపరుద్రుని కోటను పర్యాటక హబ్​గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు నాగర్​కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news