గుడ్డి అమ్మాయి అని రెండు మార్కులు వేసారు… రీ వాల్యూయేషన్ పెట్టింది… చివరికి…!

-

ఆ అమ్మాయికి కళ్ళు కనపడవు. కాని చదువు మీద ప్రేమ ఎక్కువ. చదువుకోవాలి అనే కోరిక చాలా బలంగా ఉంది. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ అమ్మాయి మాత్రం తన చదువు ఆపలేదు. కళ్ళు కనపడకపోయినా సరే చదువు మీద ఉన్న ప్రేమతో చాలా జాగ్రత్తగా శ్రద్దగా చదువుకుంది. అయితే హర్యానా బోర్డు పరీక్షల్లో ఆ అమ్మాయికి ఊహించని షాక్ తగిలింది.

హిసార్ లో నివాసం ఉండే అమ్మాయి… 10 వ తరగతి పరీక్షలో గణితంలో 2 మార్కులు మాత్రమే వచ్చి ఫెయిల్ అయింది. ఆమె పేరు సుప్రియ. నేను బాగా చదివాను కదా నాకు అని తక్కువ మార్కులు ఎలా వచ్చాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఆమె రీ వాల్యుయేషన్ పెట్టుకుంది. అప్పుడు ఆమెకు వందకు వంద మార్కులు వచ్చాయి. ఈ పరిణామం చూసి రాష్ట్రం మొత్తం షాక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news