తెలంగాణ బిడ్డకు కీలక పదవి… యూజీసీ చైర్మన్ గా నియామకం.

-

తెలంగాణ బిడ్డకు కీలక పదవి లభించింది. అత్యంత ప్రముఖమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ) చైర్మన్ గా  తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమించారు. ఈ పదవికి జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీచేసింది.

ఇంతకుముందు జగదీష్ కుమార్ ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేవారు. ప్రస్తుతం యూజీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. యూజీసీ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. జగదీష్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం  మామిడాల గ్రామం. తెలంగాణ వ్యక్తి ఈ స్థానంలో నియమితులు కావడం తెలంగాణకు గర్వకారణం కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news