బ్రేకింగ్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

-

కరోనా కారణంగా నిన్న అన్ని విద్యాసంస్థలు మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకుంది. తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి కొద్ది క్షణాల క్రితం ప్రకటించింది.

త్వరలోనే జరగాల్సిన అన్ని పరీక్షలు రీ షెడ్యూల్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు నిన్న తెలంగాణ సర్కార్ ప్రకటించింది. విద్యాసంస్థల మూత పడటంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మళ్ళీ పరీక్షలు ఉప్పుడు ఉంటాయి అనేది కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news