దూసుకొస్తున్న ”ఉమ్ ఫున్” తుఫాన్‌..

-

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉమ్ పున్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డింద‌ని ఈ మేర‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలియజేసింది. ఈ క్ర‌మంలో ఈ తుఫాన్ మ‌రో 12 గంట‌ల్లో బ‌ల‌ప‌డుతుంద‌ని.. త‌రువాత అది తీవ్ర తుఫాన్‌గా మారుతుంద‌ని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పారాదీప్‌కు ద‌క్షిణంగా 990 కిలోమీట‌ర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృత‌మై ఉందని వారు తెలియ‌జేశారు.

umphun cyclone coming very quickly

కాగా ఈ తుఫాన్ గంట‌కు సుమారుగా 6 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతుంద‌ని అధికారులు తెలిపారు. ఉత్త‌ర ఈశాన్య దిశ‌గా తుఫాన్ వెళ్తుంద‌ని దీంతో మే 20వ తేదీన మ‌ధ్యాహ్నం బెంగాల్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య సాగ‌ర్ దీవుల వ‌ద్ద ఈ తుఫాన్ తీరం దాటుతుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు.

ఇక తుఫాన్ వ‌ల్ల ఒడిశా, బెంగాల్‌, కోస్తాంధ్రలో ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని అధికారులు తెలిపారు. క‌నుక తీర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news