బిగ్ బాస్ షో: తెలిసి తెలిసి రాయితో ప‌ళ్లు…!

-

ఆ షో గురించి కొంతమంది అద్భుతం అంటారు.. మరి కొందరు మాత్రం అంతలేదని పెదవి విరుస్తారు… అదే బిగ్ బాస్ షో! గత మూడు సీజన్ లుగా తెలుగులో కూడా అలరిస్తోన్న ఈ సీజన్ పై తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు యాంకర్స్ ఘాన్సీ! అవును… ఆమెకు ఎప్పుడో ఆ షోలో అవకాశం వచ్చినా వెళ్లలేదని చెబుతూ… అందుకు గల కారణాలను తనదైన శైలిలో చెప్పుకొస్తున్నారు ఝాన్సీ!

వివరాళ్లోకి వెళ్తే… ‘బిగ్‌బాస్ – 4’లో అవకాశం వస్తే వెళతారా అంటూ.. యాంకర్స్ ఝాన్సీకి ఇటీవల ఓ ఇంటర్వులో ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ… తనకు అసలు ఆ ‘బిగ్‌బాస్’లోకి వెళ్లాలనే ఆసక్తే లేదని మొదలుపెట్టిన ఆమె… సీజన్ 1లో ముందు ఆఫర్ తనకే వచ్చిందని.. అయితే అప్పుడే రానని చెప్పానని.. ఇప్పుడు అయితే వెళ్లే ఆలోచన ఏమాత్రం లేదని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగారనుకుంటే పొరపాటే… ఇంకో అడుగు వేసిన ఘాన్సీ… “తెలిసి తెలిసి రాయి ప‌ట్టుకొని ఎవ‌రైనా ప‌ళ్లు ఊడ‌కొట్టుకుంటారా? నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌న్ను నేను బాధ‌పెట్టుకోవ‌డం నాకు ఇష్టం లేదు” అని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఆ షో లో పాటిస్పేట్ చేసినవారు మాత్రం… బిగ్ బాస్ షో పై ఘాన్సీకి ఈ స్థాయిలో వెగుటు ఎందుకబ్బా అని అంతా ఆశ్చర్యపోతున్నారట!

కాగా… తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమం బుల్లితెరపై సంచలన విజయం సాధించిందనే చెప్పాలి. అనంతరం నేచురల్ స్టార్ నాని రెండో సీజన్‌ కు, మూడో సీజన్‌ కు కింగ్ నాగార్జున హోస్ట్‌ లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news