జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మీద తిరగబడిన ఉండవల్లి ?

-

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ పరిపాలన పై గత కొన్ని రోజుల నుండి విమర్శలు మీద విమర్శలు చేయటం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. పరిపాలన అంతా బాగుంది అని మురిసిపోవటం కాదు పెన్షన్ల విషయంలో ఉన్న వాళ్ల దగ్గర నుండి తీసేయడం అన్న కాన్సెప్ట్ రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు తీసుకురావడం గ్యారెంటీ అని ఉండవల్లి పేర్కొన్నారు. Image result for undavalli jagan

ఈ నేపథ్యంలో ఇటీవల రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ పెట్టాలని వైయస్ కోరిక అని ఉండవల్లి జగన్ కి లెటర్ రాశారు. అంతేకాకుండా రాజమండ్రిలోని తెలుగు వర్శిటీ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై తిరగబడేటట్లు ఉండవల్లి రియాక్ట్ అయ్యారు.

 

రాజమండ్రికే తలమానికంగా నిలుస్తుందని భావించిన తెలుగు వర్సిటీకి ఈ పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. ఈ విధంగానే లెక్కలేని తనం గా ముందుకు వెళితే ప్రభుత్వంపై కోర్టు కి వెళ్లడానికి రెడీ అవుతామని జగన్ కి ఉండవల్లి లేఖ రాసినట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news