ఉదయం పెళ్లనగా వరుడికి ఊహించని షాక్..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైంది. పెళ్లి కోసం అందరు ఎన్నో కలలు కంటారు. ఇక పొద్దున్నే పెళ్లనగా వరుడికి ఊహించని షాక్ తగిలింది. తాను చేసిన పాపం వెంటాడడంతో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు నేరుగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిని లొంగదీసుకున్నాడు. మోజు తీరాక ఆమెకు హ్యాండిచ్చి మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తీరా ఆరా తీస్తే వరుడు వల్లే యువతి ఆత్మహత్యకు పాల్పడిందని తెలియడంతో జైలుపాలయ్యాడు.

marriage
marriage

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముజఫ్ఫర్ నగర్‌కి చెందిన యువకుడు(27) అదే ప్రాంతానికి చెందిన యువతి(26) కొద్దికాలంగా ఒక్కరిని ఒకరు ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ప్రియురాలిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా ఆమెపై మోజు తీరాక ప్రియుడు ముఖం చాటేశాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఈ నెల 20న పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడని ఫిర్యాదు చేసింది.

యువకుడిలో ఎలాంటి మార్పు కనిపించ లేదు. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు మరో యువతితో పెళ్లికి రెడీ అవుతున్న ప్రియుడి ఇంటికి వెళ్లింది. అతని ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మోసగాడిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. పెళ్లి పేరుతో తనను నమ్మించి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని.. అయితే అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో ఆత్మహత్య చేసుకుందని రామ్‌రాజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యేంద్ర నగార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news