కేసీఆర్ యాగం.. హైడ్రాపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

-

రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు హీటెక్కుతున్నాయ. వచ్చే నెల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో అధికార, ప్రతిపక్ష్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి అధికారంోలకి వచ్చేందుకు కూతురు కవిత లిక్కర్ కేసు నుంచి బయట పడేందుకు కేసీఆర్ ఫాంహౌజ్ యాగాలు చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారని.. ఆ విషయం వారికి అర్థం కావడం లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు. హైడ్రాకు నిజంగా దమ్ముంటే.. ఓవైసీ ఫాతిమా కాలేజీలను ముందుగా కూల్చాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కేడర్ దృష్టి సారించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news