నేడు హైదరాబాద్‌కు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌

-

కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.40గం.కు కృష్ణంరాజు నివాసానికి వెళ్తారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు సంతాపసభలో పాల్గొంటారు.

మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇవాళ రాత్రి 9 గంటల 50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజేంద్ర నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఏడు కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 13 వందల మంది కళాకారుల ప్రదర్శనను తిలకించనున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోయన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించడానికి కారణాలు, కేసీఆర్‌ వైఖరిపై అమిత్‌షా ప్రసంగిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news