Breaking : మారేడుపల్లి ఎస్‌ఐపై కత్తితో దాడి..

-

హైదరాబాద్‌ నగరంలోని మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తన సిబ్బందితో కలిసి ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఆపిన ఎస్‌ఐ.. వారిని ప్రశ్నించారు. అయితే వారిలో ఓ వ్యక్తి తనవద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ కడుపులో పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Indian-origin man dies in knife attack in UK

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కాగా, వారంరోజుల క్రితం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దొంగల పట్టుకునేందుకు మఫ్టీలో మాటువేసిన సీసీఎస్‌ హెడ్ కానిస్టేబుల్‌ యాదయ్య, గిరిపై కత్తిలో దాడిచేశారు దుండగులు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ యాదయ్య తీవ్రంగా గాయడ్డారు. ప్రస్తుతం ఆయన దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news