Unstoppble With NBK: బాలయ్య టాక్ షోకి ఫస్ట్ గెస్ట్ అతనేనట..! కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్

-

Unstoppble With NBK: నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ కోసం బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్. ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే.. అస‌లు బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌డంట‌నే .. చాలా ఆసక్తిగా ఉంది. ఆయ‌న మామూలుగా మాట్లాడితేనే.. అన్‌స్టాప‌బుల్ గా ఉంటుంది.


ఎక్కడ మొదలుపెడతాడో.. ఎక్క‌డ స్టాప్ చేస్తాడో ఎవరికి తెలియ‌దు. అలాంటి బాలయ్యతో టాక్ షో అంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఈ షో ను దీపావ‌ళి కానుక‌గా నవంబర్ 4 నుంచి మొదలు పెట్ట‌నున్నారు. ఈ త‌రుణంలో ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరనేది సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రిగింది. తొలి అథితిగా మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించ‌నున్నార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. కానీ, ఆ వార్తలు అవాస్త‌మ‌ని తేలిపోయింది. మోహన్ బాబుని ఫ‌స్ట్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారు. ఈ షోకి మోహ‌న్ బాబును పిలువ‌డం నిజంగా సంచలనమే.

చిరంజీవికి మోహన్ బాబుకు మ‌ధ్య మళ్ళీ కోల్డ్ వార్ నడుస్తున్న త‌రుణంలో అల్లు అర‌వింద్ ఆయ‌న‌ను ఫ‌స్ట్ గెస్ట్ గా పిలువ‌డ‌మేంట‌ని మెగా ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు. అలాగే.. మంచు ఫ్యామిలీకి బాలకృష్ణకు విబేధాలు ఉన్నాయ‌ని విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో బాల‌య్య ప్ర‌శాంతంగా ఇంటర్వ్యూ మొత్తం కంటిన్యూ చేశాడా..? లేదా ..? అనేది చ‌ర్చ‌నీయంగా మారింది. ఈ షో షూటింగ్ త‌రువాత‌ మోహన్ బాబు, బాల‌య్య‌లు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news