భాజపా కు షాక్…

-


యూపీలోని బహరేచ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సావిత్రి బాయి ఫూలే పార్టీకి రాజీనామా చేసి భాజపాకు షాక్ ఇచ్చారు. దీనికి తోడు ఆమె అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగారు. భాజపా అనుబంధ సంస్థలు ఆలయాల పేరుతో సమాజాన్ని ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించింది. భారతదేశ సంపదను దేశ అభివృద్ధికి కాకుండా వారి స్వలాభం, స్వార్థం కోసం విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

హనుమంతుడు దళితుడేనని భాజపాఎంపీ సావిత్రి అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు దళితులపై ప్రేమ ఉంటే హనుమంతుడిని అభిమానించే దాని కంటే రెట్టింపు.. దళితులని ప్రేమించాలన్నారు ఫూలే. దళితులను ఎప్పుడైనా యోగి కౌగిలించుకున్నారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎంపీనే ఇలా చేయడాన్ని భాజపా నేతలు తట్టుకోలేపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news