మాజీ ఎంపీ మధుయాష్కీకి చేదు అనుభవం..

-

మరి కొద్ది గంటల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కికి కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లిలో చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆయనకు నిరసన వ్యక్తం అయింది. మెట్‌పల్లిలోని ఓ వైద్యుడి ఇంటికి వచ్చిన ఆయనను కాంగ్రెస్‌ అసంతృప్త కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములకు టికెట్‌ రాకుండా మధుయాష్కీ అడ్డుకున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెరాస కార్యకర్తలు డబ్బులు పంచడానికే మధుయాష్కీ అక్కడికి వచ్చారనే అనుమానంతో వారూ ఆందోళనకు దిగారు.

ఇరు పార్టీల నేతలు ఆందోళనలతో మధుయాష్కీ  ఇంటి వెనుకనుంచి వెళ్లిపోయారన్న సమాచారంతో మరింత ఆగ్రహావేశాలకు లోనై ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆయన ద్విచక్రవాహనంపై అక్కడినుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకున్న సమయంలో మధు యాష్కి ఘటనతో తెరాస కు మరింత బలం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news