గ్యాంగ్ స్టర్ ముఠా కాల్పులు..! ఒక డీఎస్పీ, ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుల్స్ మృతి…!

-

up cm yogiadityanath serious on gangster vikas dubey and his gang
up cm yogiadityanath serious on gangster vikas dubey and his gang

అదో కరుడుగట్టిన క్రిమినల్ గ్యాంగ్..! ఆ గ్యాంగ్ కు గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే..! వీరిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ప్రజలను చాలా హింసించారు, ఇక వీరిని ఎలాగైనా పట్టుకోవాలను వీరికి తగిన బుద్ధి చెప్పాలని డీఎస్పీ దేవేంద్ర మిశ్రా ఫిక్స్ అయ్యారు. వీరిని పట్టుకునేందుకు 16 మంది టీంతో ఆయన వారు ఉండే నివాసం దగ్గరకు బయలుదేరారు. దాన్ని గమనించిన గ్యాంగ్ సభ్యులు పోలీసుల పైకే కాల్పులు చేశారు. డీఎస్పీ మరణించారు…!

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వికాస్ దుబే అనే ఓ గ్యాంగ్ స్టర్ కొందరు కరుడుగట్టిన క్రిమినల్స్ తో తన గ్యాంగ్ ను నడుపుతున్నాడు. వీరికి మానవత్వమే లేదు దాదాపుగా నరరూప రాక్షసులు..! సమాజాన్ని ఎంతగానో హింసించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని డీఎస్పీ దేవేంద్రా మిశ్రా ఫిక్స్ అయ్యాడు తన 16 మంది టీమ్ తో వికాస్ దుబే స్థావరం పై అటాక్ చేశాడు. పోలీసుల రాకను గమనించిన దుబే గ్యాంగ్ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డీఎస్పీ దేవేంద్రా మిశ్రాతో పాటు మరో ఐదుగురు పోలీసులు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ క్రిమనల్ ముఠా మాత్రం తప్పించుకుంది. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సీఎం యోగి ఆధిత్యనాథ్ మరణించిన పోలీసులకు సంతాపం తెలిపారు. ముఠాను ఎలాగైనా పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news