మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రఖుల్, వైష్ణవ్ తేజ్ సినిమా నుండి అప్డేట్.. !

-

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఉప్పెన విజయవంతం కావడంతో వైష్ణవ్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ ఉప్పెన కంటే ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇతర టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో ఉప్పెన సినిమాను విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ అప్డేట్ ఇచ్చింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ను ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. గ్రామీణ అటవీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కరోనా సమయంలో దీనికి సంబంధించిన ఓ ఫోటో విడుదల కాగా అందులో రకుల్ ప్రీత్ సింగ్ పల్లెటూరి యువతి గెటప్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని కొండ పొలం అనే ఓ ప్రముఖ నవల ఆధారంగా దర్శకుడు తెరకెక్కించారు. ఇక చాలా కాలం తర్వాత ఈ సినిమా నుండి అప్డేట్ రావడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news