పాక్ ప్లేయర్ పరువు తీసిన బాలీవుడ్ నటి ఊర్వశి !

-

టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య టీమిండియా వికెట్ రిషబ్ పంత్ పై సంచలన ఆరోపణలు చేసిన ఊర్వసి, ఇటీవల నసీమ్ షా ను ఉద్దేశించి ఓ వీడియోను షేర్ చేయడం సంచలనం సృష్టించింది. ఆసియా కప్ 2022 లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కు హాజరైన ఊర్వశి రౌటేలా మ్యాచ్ అనంతరం అతనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియోలో ఉన్న నసీమ్ షా, ఊర్వశి వైపు పదేపదే చూడగా ఆమె సిగ్గుపడుతుండడం కనిపించింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని యువ ప్లేయర్ పై ఊర్వశి కన్ను పడిందని, అతనితో డేటింగ్ చేస్తుందనే వార్తలు షికారు చేశాయి.

ఈ వ్యవహారంపై నసీమ్ షా ను పాకిస్తాన్ మీడియా వివరణ కోరగా, అసలు ఊర్వశి రౌటేలా ఎవరో కూడా తనకు తెలియదని బదులిచ్చాడు. ఇక తాను ఎవరో తెలియదంటూ నసీమ్ షా చేసిన వ్యాఖ్యలపై ఊర్వశీ రౌటేలా స్పందించింది. నసీమ్ షా తో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను ఆపేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా మీడియాను కోరింది. అది సరదా కోసం చేసిన పనని, నసీమ్ షా కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news