తెలంగాణ‌ మున్సిపల్‌ ఎన్నికలు.. కోర్టును ఆశ్రయిస్తాం అంటున్న ఉత్తమ్‌

-

తెలంగాణ‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు. ఇదిలా ఉంటే.. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్‌ ఖరారు చేయడంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలంటే భయం లేదని ఆయన అన్నారు.

ఆదివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, హడావిడిగా మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను చేపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదో తేదీన రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఆరో తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయడం.. ఎనిమిదో తేదీన నామినేషన్లు స్వీకరించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ విషయమై మరింత గడువు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news