నన్ను బినామీగా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు : వైశాలి

-

తెలంగాణలో మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. నవీన్ రెడ్డి, వైశాలి మధ్యన అసలేం జరిగింది? నవీన్ రెడ్డి ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశాడు? వీరిద్దరికి పెళ్లయిందా? పెళ్లైతే ఇప్పుడెందుకు వైశాలి మాట మార్చింది? నవీన్ రెడ్డిది ప్రేమోన్మాదమా? తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదన్న పైశాచికత్వమా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే.. ఇప్పటికే తనకు ఇష్టం లేకపోయినా నవీన్‌ రెడ్డి బలవంతంగా తనను తీసుకెళ్లాడని వైశాలి ఆరోపించారు. అంతేకాకుండా హెల్ప్‌ అని అరిస్తే.. తనను గోళ్లతో గిచ్చారని, కొరికారని ఆమె వెల్లడించింది. అయితే.. తాజాగా నేడు వైశాలి మీడియాతో మాట్లాడుతూ.. నవీన్‌ రెడ్డి సైకో అని వ్యాఖ్యానించింది. తనకు నేను దక్కాలని సైకోగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది. తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, నవీన్ రెడ్డి తనను బినామీగా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆరోపించింది.

Adibatla Kidnap Case: Vaishali makes sensational comments on Naveen Reddy | Vaishali  Kidnap Case: ప్లీజ్ ప్లీజ్ అని వేడుకున్నా.. నన్ను దారుణంగా కొట్టారు!  గోళ్లతో గిచ్చి కొరికారు ...

ఇదిలా ఉంటే.. వైశాలి కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఏడాదికాలంగా వైశాలిని నవీన్ రెడ్డి తీవ్ర వేధింపులు గురిచేస్తున్నట్లు , వైశాలి ఇంటి ముందట నిర్మాణాలు చేసి హంగామా చేసినట్లు, ఖాళీ స్థలం ను లీజుకు తీసుకొని షేడ్ లు వేసినట్లు తెలుస్తో్ంది. షెడ్డులో ప్రతినిత్యం గానా బజానా నిర్వహించిన నవీన్ రెడ్డి.. తన మిత్రులతో కలిసి ప్రతినిత్యం హంగామా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news