వైఎస్ వివేకాను చంపిందేవరో జగన్‌ కు తెలుసు.. అధికారం కోసమే : వర్ల రామయ్య

-

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్యపై ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ పెద్ద పెద్ద డ్రామాలు ఆడారని.. హత్య జరిగినా రోజే చంపింది ఎవరనేది సీఎం జగన్‌ కు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కు రూ. 40 కోట్లు సుపారి ఎవరు ఇచ్చారనేది తెలిసి కూడా సీఎం జగన్ ఆనాడు మాపై నెపం నెట్టారన్నారు. అధికారం కోసం బాబాయ్ హత్య ను కూడా వాడుకున్న చరిత్ర సీఎం జగన్‌ దేనని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయం బయటపడుతుందని తెలిపారు వర్ల రామయ్య.

మాజీ మంత్రి చిన రాజప్ప.. కూడా వివేకా హత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో జగనుకు తెలుసని… హంతకులెవరో తెలిసినా రెండున్నర ఏళ్లుగా జగన్ మౌనంగా ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా వివేకాని చంపిన హంతకులకు కఠిన శిక్ష పడేలా చేయాలని… సీఎం అయి ఉండి ఇకనైనా అబద్ధాలు ఆడడం మానాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news