టీడీపీ అంటే తెలుగు డర్టీ పార్టీ : వరుదు కళ్యాణి

-

తెలుగు దేశం పార్టీ అంటే తెలుగు డర్టీ పార్టీ, తెలుగు దుశ్సాసనుల పార్టీ, దుర్యోధనుల పార్టీ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి అన్నారు. మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. మహిళా లోకం తలదించుకునేలా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడారని విమర్శించారు. వంగలపూడి అనిత భాష అసభ్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత మాట్లాడే భాషను ఆమె పిల్లలు హర్షించరన్నారు. మహిళల పేరెత్తే అర్హతే టీడీపీకి లేదన్నారు. సైకో పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని, మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. మహిళలను అవమానించిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, నారాయణ ఇంటి ముందు అనిత దీక్షలు, ధర్నాలు చేయాలని సూచించారు. విశాఖలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

YSRCP MLC Varudu Kalyani Comments On Chandrababu - Sakshi

రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం 5.1 శాతం తగ్గిందని సర్వేలు చెపుతున్నాయని, ఇదంతా జగన్ సంక్షేమ పథకాలతోనే సాధ్యమయిందని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత జగన్ దని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news