నా జీవితాంతం వైసీపీ పార్టీలోనే ఉంటా – వసంత కృష్ణ ప్రసాద్

-

నా జీవితాంతం వైసీపీ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇవాళ మీడియాతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసిపి నిర్వహిస్తున్న గడప గడప నిర్వహించలేదని.. సిఎం జగన్‌ పిలిచి మాట్లాడారు.. ఇకపై నేను గడప గడప ప్రారంభిస్తున్నానని వెల్లడించారు.

నాపై పార్టీ మారుతున్నాని ప్రచారాలు జరుగుతున్నాయని.. నేను వైఎస్ఆర్ అభిమానిని నేను ఎప్పటికి పార్టీ మారానని తేల్చి చెప్పారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై చర్చించామని.. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కోట్ల రుపాయలు వెచ్చించి సంక్షేమ పధకాలు సిఎం చేస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో గొల్లపూడి లో ఒక్క సంఘటన జరిగిందని.. సాధారణ మహిళ సోషల్ మీడియా వేదికగా టీడీపీ తన స్దలాని కబ్జా చేస్తున్నారని చెప్పిందని వివరించారు. ఆ వ్యవహారంలో నాపై తల్లశిల రఘురాజు పై ఆరోపణలు చేశారన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news