Ved : మజిలీ రీమేక్​ మూవీకి రికార్డు స్థాయి వసూళ్లు

-

టాలీవుడ్​లో ఒకప్పటి పవర్ కపుల్ సమంత-నాగచైతన్య పెళ్లి తర్వాత కలిసి నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీని మరాఠీలో వేడ్ పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ పవర్ కపుల్ రితేశ్ దేశ్​ముఖ్-జెనీలియా ఇందులో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాను రితేశ్​ డైరెక్ట్ చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.44.92కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.

ఈ సినిమాతో రితేశ్ డైరెక్టర్ అవతారమెత్తాడు. అంతేకాదు పదేళ్ల తర్వాత జెనీలియాతో కలిసి నటించాడు. కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగులో నాగచైతన్య పాత్రను రితేశ్‌, సమంత పాత్రను జెనీలియా పోషించారు. నూతన సంవత్సర కానుకగా డిసెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఏకంగా రూ.3.5కోట్లు (గ్రాస్‌) వసూలు చేయగా, 15రోజుల్లో రూ.44.92కోట్లు రాబట్టింది. మరాఠా బ్లాక్‌ బస్టర్‌ ‘సైరాట్‌’ (రూ.110 కోట్లు) తర్వాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘వేద్‌’ నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news