“వేదం” నాగయ్య ఇక లేరు..

-

క్రిష్ దర్శకత్వం వహించిన వేదం సినిమాని ఎప్పటికీ మర్చిపోలేం. బన్నీ, మనోజ్, అనుష్క నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవ్వరూ చూడని కథలని తెర మీదకి వేదం సినిమాతో క్రిష్ తీసుకువచ్చాడు. అందులో అందరినీ బాగా ఆకర్షించిన పాత్ర సిరిసిల్ల రాములుది. నాగయ్య చేసిన ఈ పాత్ర ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా మొత్తంలో ఆ పాత్ర అందరికీ దగ్గరైంది. మారుమూల తెలంగాణ గ్రామీణ ప్రాంతం వాడిగా నాగయ్య నటన అందరినీ మెప్పించింది.

ఆ తర్వాత 30సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేసాడు. ఐతే ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. దాంతో ఆయన పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఆదుకుంది. కొన్ని రోజుల క్రితం నాగయ్య గారి సతీమణి స్వర్గస్తులయ్యారు. దాంతో ఆయన ఆరోగ్యం మరింత చెడిపోయింది. ఈ రోజు ఉదయం 4:30గంటలకి ఆయన తుదిశ్వాస విడిచారు.

Read more RELATED
Recommended to you

Latest news