శరద్ పవార్‌ కి త‌ృటిలో తప్పిన పెను ప్రమాదం..!

-

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ కి త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్ పవార్‌ కాన్వాయ్‌ లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పుణెలోని ఖండాలా వద్ద సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. శరద్ పవార్ కాన్వాయ్‌ లోని పోలీస్ జీపు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఐతే అప్పటికే శరద్ పవార్ ప్రయాణిస్తున్న కారు వెళ్లిపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్‌కు, కొంత మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌, పోలీసులకు సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు. కాగా, 2019 ఎన్నిక అనంతరం కాంగ్రెస్, శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news