ప్రపంచంలోనే నరేంద్ర మోడీ అత్యంత అవినీతిపరుడు – తెలంగాణ మంత్రి

-

ప్రపంచంలోనే నరేంద్ర మోడీ అత్యంత అవినీతిపరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కార్పొరేట్ దోస్తుల 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడని.. ఎల్ఐసి ల ఉన్నయి పేదల పైసలు.. అదానికి దోచిపెట్టినవ్ అంటూ ఫైర్‌ అయ్యారు. కేసిఆర్ మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్నడు…అందుకే ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నారని.. రేపు నా మీద కూడా కేసులు పెడ్తరు..భయ పడేది లేదన్నారు.

రాహుల్ గాంధీ మోడీ అవినీతిని ప్రశ్నిస్తే…. ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేశారు.. కాంగ్రెస్ సన్నాసులు అది మాట్లాడక…మా మీద పడుతున్నారని నిప్పులు చెరిగారు. పెద్దాయన డి.ఎస్ కు జాతి రత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారని… ఆయన పరిస్థితి ఏ తండ్రికి కూడా రావొద్దన్నారు. అర్వింద్ కు పసుపు రైతుల ఉసురు తగిలింది..ఇంకా తగులుతుంది… బండి సంజయ్,రేవంత్ రెడ్డికి నెత్తా…కత్తా..? ఏదిపడితే అది మాట్లాడుడే అంటూ ఫైర్‌అయ్యారు. కెటిఆర్ మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news