శివరాత్రికి ముస్తాబైన వేములవాడ రాజన్న..డ్రోన్ విజువల్స్ వైరల్

-

నేడు మహాశివరాత్రి. ఈ నేపథ్యంలోనే శివనామ స్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా వేముల వాడ ఆలయ ప్రాంగణాలు, పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

వేకువ జామునుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పరమేశ్వరుడిని దర్శించుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, వేములవాడ రాజన్న సన్నిధిలో.. డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news