BREAKING : వైసీపీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే సర్రాజు కన్నుమూత

-

వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికి వెళ్లారు.

ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు వైసిపి పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా పాతపాటీ సర్రాజు కు భార్య మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news