లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్యపురస్కారానికి ఎంపికైన వేమూరి బలరామ్

-

లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్యపురస్కారానికి వేమూరి బలరామ్( స్వాతి బలరామ్)..ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే, ఈ నెల 18 న అంటే రేపు సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో ప్రదానం చేయనున్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్‌.వెంకయ్యనాయుడు‌‌. ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాలు అందుకోనున్నారు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సినీనటులు జయప్రద,జయసుధలు.

జీవన సాఫల్యపురస్కారాలకు డాక్టర్ కూచిభొట్ల ఆనంద్,కోనేరు సత్యనారాయణ, గన్ని భాస్కరరావు….ఎంపికయ్యారు. లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్ధాపకులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా తమ ఫౌండేషన్ నుంచి పురస్కారాలు అందేస్తున్నాము….తన తదనంతరం తన వారసులు పురస్కారాలు కొనసాగించ బోతున్నారు‌‌..అందుకు ఒక మూలనిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news