టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా సంచలన నిర్ణయం

-

టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బుమ్రా భారత్ జట్టులోకి తిరిగిరావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. కాగా బుమ్రా వెన్ను గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ అయితే సాధించలేదు. రాబోయే వారంలో బుమ్రా ఫిట్నెస్ టెస్టులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఫిట్నెస్ టెస్ట్ లో బుమ్రా ఉత్తీర్ణత సాధిస్తే అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టుకు ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఆసీస్ తో మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో మాత్రం బుమ్రాకు చోటు దక్కలేదు. అయితే ఆఖరి రెండు టెస్టులకు ఈ స్పీడ్ స్టార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుమ్రా తన ఫిట్నెస్ ను నిరూపించుకునేందుకు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బాటలోనే వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రంజి ట్రోఫీలో బుమ్రా ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news