వీహెచ్ కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్..

-

కాంగ్రెస్ మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతా రావు కు ఫోన్ చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్నారు వి. హనుమంతా రావు. ఈ నేపథ్యంలోనే హనుమంతా రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెకుసుకున్నారు వెంకయ్య నాయుడు.

డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పిన వెంకయ్య నాయుడు.. ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని హనుమంతా రావుకు చెప్పారు. తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్య నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు వి.హెచ్. మీ పరామర్శతో తనకు చాలా ఉత్సాహం వచ్చిందని చెప్పారు వి.హెచ్. త్వరలోనే ఆరోగ్యం నుంచి కోలుకొని.. డిశ్చార్జ్ అవుతానని చెప్పారు. గత నెలలో   వి. హనుమంతరావు హైదరాబాద్‌ లోని ప్రముఖ అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news