ఒక్కసారి కాదు వందసార్లు పాదాభివందనం చేస్తా : సిద్దిపేట మాజీ కలెక్టర్‌

-

సీఎం కేసీఆర్ కి ఒక్కసారి కాదు వందసార్లు పాదాభివందనం చేస్తానని..కేసీఆర్ నాకు దేవుడుతో సమానం… తెలంగాణ ప్రజలకు తండ్రి సామానులు అని సిద్దిపేట మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని.. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని ఫైర్‌ అయ్యారు. రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని… అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా? అని నిలదీశారు.

కేసీఆర్ చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని… తన పొలిటికల్ ఎంట్రీ పై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహించారు. అందరూ ముఖ్యమంత్రుల వద్ద పని చేశానంటే వాళ్ళు నన్ను, నా పని తనాన్ని మెచ్చుకుని పదవులు ఇచ్చారన్నారు. అందరు ముఖ్యమంత్రుల మన్ననలు పొందానంటే నేనేంటో తెలుసుకోవాలని తెలిపారు. కేసీఆర్ పని విధానానికి ఆకర్షితుడినై టీఆర్ఎస్ లో చేరానని.. కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. కలెక్టర్ పదవి వదిలి పెట్టి రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత రైతుల పక్షాన ఉద్యమం చేయడం సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news