బీజేపీ ఓ బద్మాష్ పార్టీ : కడియం శ్రీహరి ఫైర్

-

ఇవాళ ఇందిరా పార్క్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ పార్టీ.. ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. బీజేపీ పార్టీ పై ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీ బద్మాష్ పార్టీ… రాష్ట్ర బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ రైతులు పండించిన పంటను ఎఫ్ సీఐ కొనుగోలు చేయాలి. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్లలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆగ్రహించారు. ప్రధాని మోడీ స్పందించి తెలంగాణ ధాన్యం కొనుగోలు పై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.

కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని.. కేసీఆర్ రైతుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు ఎర్రబెల్లి దయాకరరావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని… రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని ఫైర్‌ అయ్యారు.
తెలంగాణలో బీజేపీ ఒక పార్టీయేనా? అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news