ఇందిరా పార్క్ చేరుకున్న సీఎం కేసీఆర్

-

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహాధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలసిందే… ఈ నేపథ్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా ప్రాంతమైన ఇందిరా పార్క్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ధర్నాలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వత రాజ్ భవన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పిలుపుతో తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కేసీఆర్ ప్రసంగం అనంతరం ఇందిరా  పార్కు నుంచి పాదయాత్రగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news