ఉన్నావ్ రేప్ కేసులో.. బీజేపీ ఎమ్మెల్యే భవితవ్యం తేలేది నేడే..

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తైన నేపథ్యంలో ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామంటూ తీస్ హజారీ కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భవితవ్యం నేటితో తేలిపోనుంది.

రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన సెంగార్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదే కేసులో శశిసింగ్ అనే వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ కేసు యూపీ నుంచి ఢిల్లీ జిల్లా కోర్టుకి బదిలీ అయిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news