నీలో వచ్చిన ఆ మార్పును పోనివ్వకు : కెసిఆర్ కు వీహెచ్ సూచనలు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ నీలో వచ్చిన మార్పుని వెనకకి పోనివ్వకు..ఈ ఉద్యమం రైతుల పట్ల ఉన్నదా ? లేదా ? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఓడిపోయినా దళిత బందు అందరకి ఇవ్వాలని కెసిఆర్ ను కోరారు. ప్రగతి భవన్ లో ఇప్పటికైనా ప్రజలను సిఎం కెసిఆర్ కలవాలని పేర్కొన్నారు.నీలో-వచ్చిన-ఆ-మార్పును-పో


తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటి సారిగా అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద దర్నా చేయబోతున్నారన్నారు.. కేంద్రం దాన్యం కొనాలని అధికార ప్రభుత్వ నాయకులు దర్నాకి దిగుతున్నారని తెలిపారు. దర్నా చౌక ఎత్తేశారు కదా…? ఇప్పుడు అదే దర్నా చౌక వద్ద దర్నాకి దిగుతున్నారంటూ చురకలు అంటించారు. దర్నా చౌక ఎత్తేస్తే తాను కోర్ట్ లో పిటిషన్ వేశానని. రైతుల పట్ల కెసిఆర్ కి చిత్త శుద్ధి ఉంటే.. నల్ల చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కెసిఆర్ కు సవాల్ విసిరారు. దర్నా తరువాత డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలని కెసిఆర్ కలువాలని సూచించారు..
పవర్ ఉన్నపుడు ఒకటి.. లేనపుడు ఒకటి చేయడం మంచిది కాదని కెసిఆర్ కు చురకలు అంటించారు వి.హనుమంతరావు..

Read more RELATED
Recommended to you

Latest news