విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా మేలో ప్రారంభం?

-

గతంలో F2, F3 చిత్రాలు అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో వచ్చి మంచి విజయం సాధించాయి. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్ మరో సినిమా చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం లో హీరోయిన్గా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని, వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్.దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

గతంలో వెంకటేష్ సంక్రాంతి అనే టైటిల్ తో వచ్చి హిట్ కొట్టారు. ఇక రాబోయే 2025 సంక్రాంతికి వెంకటేష్ తో పాటు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, ప్రశాంత్ వర్మ మూవీ , నాగార్జున మూవీ కూడా ఉండబోతున్నాయి. కాగా, విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్ గత సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news