విడాకుల దిశగా విఘ్నేశ్‌ శివన్‌, నయనతార కపుల్…?

-

ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్‌ హీరోయిన్‌ నయనతార వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్‌ చేసింది.ఇక దానికి లక్షల లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి.ప్రస్తుతం నయనతారకు ఇన్‌స్టాలో 78లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే, తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.సాంకేతికలోపం వల్ల విఘ్నేశ్‌ పేరు కనిపించడం లేదంతే’ అని అని ఒకరు పోస్ట్ పెట్టగా.. మరొకరు ‘పొరపాటున ఇలా చేశారు’ అని అన్నారు.

సుమారు 7 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news