‘గీతాగోవిందం’ కాంబో రిపీట్.. విజయ్ మరో హిట్‌ కొట్టేనా..?

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్‌తో కాస్త సైలెంట్ అయ్యారు. అయితే లైగర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేందుకు విజయ్‌కు కాస్త ఎక్కువ సమయమే పట్టింది. సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు మళ్లీ తన స్పీడ్ పెంచేందుకు రెడీ అయ్యాడు. లైగర్ అనుభవంతో ఇక నుంచి కంటెంట్‌పై కాస్త ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

ఈ ఏడాది విజయ్ దేవరకొండ నుంచి ప్రేక్షకులు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆశించొచ్చు. ఎందుకంటే.. విజయ్ వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ రౌడీ మరో కొత్త ప్రాజెక్టుతో ముందుకు రానున్నాడు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్‌కు ఆ రేంజ్ గుర్తింపు తెచ్చిన సినిమా గీతా గోవిందం. ఈ చిత్రంలో రష్మికతో విజయ్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాకు దర్శకుడు పరశురాం.

ఇప్పుడు గీతా గోవిందం కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రౌడీ మరోసారి కనిపించబోతున్నాడు. ఈ కొత్త సినిమాకు దిల్​రాజు నిర్మాతగా వ్యవరించబోతున్నాడు. ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్​.. ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news