ఏ మాత్రం భయపడకుండా సమాధానాలు ఇచ్చిన విజయ్..!!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు నిరాశే ఎదురైంది. ఇక ఏమంటూ ఈ సినిమా చేశారో కాని ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయినా కూడా వివాదాలు వదిలి పెట్టడం లేదు.

లైగర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గతంలో  ఛార్మీ, పూరీ జగన్నాథ్ ను పిలిచి విచారించారు. ప్రస్తుతం ఆ సినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండను కూడా అధికారులు బుధవారం విచారించారు.నిన్న ఉదయం ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్ ను అధికారులు దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించారని తెలుస్తోంది.

అలాగే విచారణ సందర్భంగా విజయ్ వారు అడిగే ప్రశ్నలకు ఏ మాత్రం తోణక్కుండా సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. గతంలో పూరి, ఛార్మి మీడియాతో మాట్లాడలేదు. కాని విజయ్ మాత్రం భయపడకుండా మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం ఆఫీసుకు వచ్చాం.. కొన్ని విషయాల్లో సమచారం అడిగారు.. మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు..వాళ్లకు కావలసిన సమాధానం నేను ఇచ్చాను.. మీరు ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి ఆ ప్రేమతో వచ్చే ప్రాబ్లం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.ఇది లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది.. అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు.. నన్ను విచారణకు పిలిచారు.. నా బాధ్యతగా వచ్చి సమాధానాలు చెప్పాను అని కుండ బద్దలు కొట్టినట్లు గా చెప్పేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news