కామన్‌వెల్త్‌ క్రీడాల్లో ఇండియా క్రీడాకారుల హవా.. 9 కి చేరిన పతకాల సంఖ్య

-

కామన్‌వెల్త్‌ క్రీడాల్లో ఇండియా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. మొన్నటి నుంచి ఇప్పటి వరకు ఇండియా ఏకంగా 9 పతకాలు వచ్చాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో తాజాగా భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. మహిళల జుడోలో సుశీలా దేవికి రజతం రాగా.. పురుషుల 60 కిలోల విభాగంలో విజయ్‌ కుమార్‌కు కాంస్య పతకం వచ్చింది.

దీంతో భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 9 పతకాలు వచ్చినట్లు అయింది. ఈ కామన్‌వెల్త్‌ క్రీడాల్లో ఓవరాల్‌ గా చూసుకున్నట్లయితే.. స్వర్ణాలు-3, రజతాలు-3, కాంస్యాలు-3 వచ్చాయన్న మాట. అటు పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్‌ లిఫ్టర్‌ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news