సినిమాలకు విజయశాంతి గుడ్ బై…!

-

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో విజయశాంతి నటించడంతో ఆమె అభిమానులు కూడా భారీగానే ఈ సినిమాను చూసారు. అసలు వాస్తవానికి ఈ సినిమాకు ఊహించని క్రేజ్ రావడానికి ప్రధాన కారణం రాములమ్మే అనేది చాలా మంది మాట.

అవును ఆమె కారణంగానే ఈ సినిమాకు హైప్ వచ్చిందని చాలా మంది ఇప్పటికి అంటూ ఉంటారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించి తనదైన నటనతో అలరించారు. ఈ సినిమాలో విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. దీనితో ఆమె అభిమానులు ఇక నుంచి రాములమ్మను తెరపై చూడవచ్చు అని ఆశ పడ్డారు. కాని ఇంతలోనే ఆమె షాకింగ్ విషయం తన అభిమానులకు చెప్పారు.

తాజాగా విజయశాంతి చేసిన కొన్ని ట్వీట్ లు ఆశ్చర్యంగా మారాయి. “సరిలేరు మీకెవ్వరు`.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. `కళ్ళుకుల్ ఇరమ్`, `కిలాడి కృష్ణుడు` నుంచి నేటి `సరిలేరునీకెవ్వరు` వరకు నన్ను ఆదరించి గౌరవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం..

మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు -మీ విజయశాంతి` అని ఆమె చేసిన ట్వీట్లు అభిమానులకు షాక్ ఇచ్చాయి. అయితే ఆమె నటిస్తారా లేక రాజకీయాల్లో ఉంటారా అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news