వైసిపి ఘోర ఓటమి.. స్పందించిన విజయసాయిరెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది.వైనాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు.. వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.బహుశా ఇంత దారుణంగా అధికార పార్టీ ఓడిపోతుందని వైసీపీ కలలో కూడా ఊహించి ఉండదేమో. ఈ ఓటమిపై పార్టీ నేతలు స్పందించలేని పరిస్థితి నెలకొందంటే సీన్ అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ‘రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం అని అన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలకు నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news