ఏపీ కొత్త గవర్నర్ పదవీకాలం విజయవంతం కావాలి – విజయసాయి

-

ఏపీ కొత్త గవర్నర్ పదవీకాలం విజయవంతం కావాలన్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. ఏపీకి కొత్త గవర్నర్ నియామకం అయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్లను తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ తరుణంలోనే ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఏపీ కొత్త గవర్నర్ గా ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు.అబ్దుల్‌ నజీర్… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా గతంలో పని చేశారు.

ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ విశ్వ భూషణ్ హరిచంద్రను చత్తీస్‌ ఘడ్‌ గవర్నర్ గా బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మహారాష్ట్ర మరియు సిక్కిం రాష్ట్రాల గవర్నర్లను కూడా కేంద్రం మార్చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా రమేష్ బైస్ ను నియామకం చేయగా సిక్కింకు లక్ష్మణ్ ప్రసాద్ ను నియమించింది. అయితే, కొత్త గవర్నర్‌ ఎంపికపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆయన ఎక్సలెన్సీ యొక్క గొప్ప మరియు అపారమైన అనుభవం రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తుంది. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news