ఏపీలో “బూతు దీక్షలు”.. ఢిల్లీలో సాష్టాంగ నమస్కారాలు : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై అధికార వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటారు. పొద్దున లేస్తే చాలు చంద్రబాబు వైఫల్యాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు విజయసాయి రెడ్డి. ఇక తాజాగా చంద్రబాబు చేసిన దీక్ష మరియు ఢిల్లీ టూర్ పై చురకలంటించారు విజయసాయిరెడ్డి. ఏపీలో బూతు దీక్షలు చేస్తూ… ఢిల్లీ పెద్దల వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తారు అంటూ మండిపడ్డారు విజయసాయి.

” ఏ ప్రతిపక్ష నాయకుడైనా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాడు. రాష్ట్రానికి నిధులో, హోదానో కావాలని దీక్షలు చేస్తారు. ఏపీలో మాత్రం’బూతు దీక్షలు’. ఢిల్లీలో పెద్దల దగ్గర ‘అయ్యా అయ్యా’ అంటూ సాష్టాంగం. బయటకొచ్చి దులిపేశానని బుకాయింపులు. ఆ ప్రతిపక్ష హోదా ఊడే వరకు మనకీ ఖర్మ తప్పదు.” అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

ఇక మరో ట్వీట్ లో ” తాను సీఎంగా ఉండగా ప్రధాని మోదీకే ఏపీలోకి ప్రవేశం లేదని, గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ బోర్డులు పెట్టించి, ఆయన గుజరాత్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తానని, అమిత్ షా వస్తే రాళ్లు వేయించిన వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ల అపాయింట్మెంట్లు కోరుతున్నాడు?” అంటూ ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news