టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలి : విజయసాయి సెటైర్

-

టిడిపి పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 న జరుగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు.. పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు. అయితే దీనిపై విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలంటూ చంద్రబాబు ఫోటో ను షేర్ చేశారు. “40 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నా. అయితే తుప్పు- పప్పు నాయుళ్లు మాత్రం అర్థశతకం కొట్టేదాకా కూడా బతకనిచ్చేలా లేరు. 2024 ఎన్నికలే ఆఖరి పోరాటం…ఆపై అస్త్ర సన్యాసం అనేలా ఉన్నాయి.” అంటూ చురకలు అంటించారు విజయసాయి.

టీడీపీ వ్యవస్థాపక దినం నాడైనా చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ‘నమ్మక ద్రోహం’పై పచ్చాతాపం వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. 2 రూపాయల కిలో బియ్యం రద్దుపైనా, లిక్కర్ కంపెనీలు విదిలించిన 2 వేల కోట్లకు కక్కుర్తిపడి నిషేధం ఎత్తేయడంపైన జవాబు చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు.

ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయోత్సవాలు నిర్వహిస్తారట టీడీపీని పాతరేసిన చంద్రబాబు.. పార్టీ స్థాపించన చోట ఒక్క ఎమ్మెల్యే, కార్పోరేటర్ ఎందుకు గెలవలేక పోయారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే కదా తెలంగాణాలో జెండా పీకేసిందని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news