కేసీఆర్ స‌ర్కార్‌కి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది – విజయశాంతి

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ఆయన సర్కార్‌ కు ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందని ఎద్దేవా చేశారు బీజేపీ నేత విజయశాంతి. కేసీఆర్ కిట్లలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయిన వస్తువులు పంపిణీ అవుతున్నాయి… వాటినే బాలింతలకు అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పాతబస్తీకి చెందిన ఓ బాలింతకు ఇచ్చిన కిట్‌‌‌‌‌‌‌‌లో అన్ని వస్తువులూ ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయినవే ఉన్నాయని నిప్పులు చెరిగారు విజయశాంతి.

ఇంటికెళ్లిన తర్వాత… చర్యలు తప్పవనీ హెచ్చరించారు. కేసీఆర్ కిట్ల కొనుగోలు, పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నయని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్… ప‌థ‌కానికి నీపేరు పెట్టుకుంటే స‌రిపోదని ఆగ్రహించారు. దాని అమ‌లు తీరును కూడా ప‌ట్టించుకోవాలి. ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయిన వస్తువులు పంపిణీ చేస్తున్న కేసీఆర్ స‌ర్కార్‌కి కూడా త్వరలోనే ఎక్స్‌పైరీ డేట్ రానుందని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news